నేషనల్ డే ఉల్లంఘనలు: 427 కార్ల స్వాధీనం
- December 12, 2015
నేషనల్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు పెద్దగ తలెత్తలేదు. అన్ని చోట్లా తగిన విధంగా సిబ్బందిని నియమించడం, అలాగే నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై నిఘా పెట్టడం ద్వారా ఉల్లంఘనల్ని చాలావరకు తగ్గించగలిగారు. అయితే నిబంధనల్ని ఉల్లంఘించిన 427 కార్లను మాత్రం ట్రాఫిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చట్టాలను లెక్క చేయకుండా కార్లను డెకరేషన్ చేయడం, మితిమీరిన శబ్దంతో హారన్ మోగించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలకు పాల్పడినందుకు ఆ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబీ పోలీస్, ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ హుస్సేన్ అహ్మద్ అల్ హరితి మాట్లాడుతూ, ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాల్సిందేనని చెప్పారాయన. వాహనదారులు తమ వాహనాలకు ఏర్పాటు చేసిన డెకరేషన్లను తొలగించాలనీ, లేదంటే ఫైన్ విధింపబడ్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల, రోడ్లపై వాహనదారుల భద్రత పట్ల అవగాహన కల్గించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతోంది ట్రాఫిక్ విభాగం.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







