వీర భోగ వసంత రాయలు టైటిల్ పోస్టర్
- July 11, 2018
కెరీర్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న హీరో నారా రోహిత్. త్వరలో ఆటగాళ్లు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నారా రోహిత్ ప్రస్తుతం వీర భోగ వసంత రాయలు అనే సినిమా చేస్తున్నాడు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీ విష్ణు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ అభిమానులలో ఆసక్తి కలిగిస్తుంది. శ్రియ కూడా చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆమె పాత్ర కూడా ముగ్గురు హీరోలకి సమానంగా ఉంటుందని అంటున్నారు. అప్పారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంద్రసేన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి తర్వాత శ్రియ చేయబోవు తొలి సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక ఇటీవల సమ్మోహనం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక అసుర ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న తిప్పరా మీసం చిత్రంతో బిజీగా ఉన్నాడు శ్రీ విష్ణు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







