వరంగల్ మహిళ కౌసర్కు అరుదైన అవకాశం
- July 12, 2018
వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. గత కొద్ది రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలుకరించేందుకు ప్రధాన మంత్రి జన్సంవాద్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) వర్గానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. ఈ క్రమంలో మోదీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్కు లభించింది. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కౌసర్.. ప్రధానితో ముచ్చటించారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో మహిళలు పొదుపు పాఠాలు చెప్పిన కౌసర్.. ఎంతో మంది మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ నేడు దేశవ్యాప్తంగా ఆమెకు ఖ్యాతిని పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







