జాన్సన్ అండ్ జాన్సన్ కు రూ.32వేల కోట్ల జరిమానా

- July 13, 2018 , by Maagulf
జాన్సన్ అండ్ జాన్సన్ కు రూ.32వేల కోట్ల జరిమానా

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అమెరికా కోర్టు రూ.32వేల కోట్లు (470 కోట్ల డాలర్లు) జరిమానా వేసింది. ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్‌ను వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు దాఖలైన పిటీషన్‌లో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చినట్లు కొందరు మహిళలు కంపెనీపై పిటీషన్ వేశారు. జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌లో అస్‌బెస్టాస్ ఉన్నట్లు పరిశోధనలో తేల్చారు. దాని వల్లే ఒవేరియన్ క్యాన్సర్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇవ్వగానే కంపెనీ షేర్లు పడిపోయాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com