ఇంద్రగంటి సినిమాలో హీరోలు ఎవరో తెలుసా?
- July 14, 2018
టాలీవుడ్ లో ఈ మద్య కొత్త దర్శకుల జోరు బాగా పెరిగిపోయింది..ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డితో సందీప్ వంగ, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది? సినిమాతో తరుణ్ భాస్కర్, సమ్మోహనంతో ఇంద్రగంటి ఇలా మంచి కంటెంట్ తో తీస్తున్న సినిమాలు సక్సెస్ సాధించడమే కాదు..కలెక్షన్లు కూడా బాగానే వసూళ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు తో తీసిన 'సమ్మోహనం'సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు ఇంద్రగంటి. తన నెక్ట్స్ ప్రాజెక్టుగా ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.
దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోలు ఫిక్స్ అయ్యారు. కాకపోతే అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదంతే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని, శర్వానంద్ హీరోలుగా నటించబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దర్నే హీరోలుగా పెట్టి, ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఇక సినిమా మంచి ఎంట్రటైన్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సాగబోతుందట.
ట్విస్ట్ ఏంటంటే..ఈ సినిమాల విశ్రాంతి వరకు ఎవరు హీరో అన్న విషయం సస్పెన్స్ తో ఉండబోతుందట. అంతే కాదు ఈ సినిమాలో ఇద్దరూ కొంత సమయం వరకు నెగిటీవ్ షేడ్స్ లోనే ఉంటారని సమాచారం. హీరో ఎవరనే విషయం సెకండాఫ్ లో రివీల్ అవుతుందట.సాంకేతికంగా ఈ సినిమాలో పెద్దగా మార్పుచేర్పులు ఉండవని తెలుస్తోంది. రెగ్యులర్ గా ఇంద్రగంటి సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్లే దీనికి కూడా వర్క్ చేస్తారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







