ఇంద్రగంటి సినిమాలో హీరోలు ఎవరో తెలుసా?
- July 14, 2018టాలీవుడ్ లో ఈ మద్య కొత్త దర్శకుల జోరు బాగా పెరిగిపోయింది..ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డితో సందీప్ వంగ, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది? సినిమాతో తరుణ్ భాస్కర్, సమ్మోహనంతో ఇంద్రగంటి ఇలా మంచి కంటెంట్ తో తీస్తున్న సినిమాలు సక్సెస్ సాధించడమే కాదు..కలెక్షన్లు కూడా బాగానే వసూళ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు తో తీసిన 'సమ్మోహనం'సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు ఇంద్రగంటి. తన నెక్ట్స్ ప్రాజెక్టుగా ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.
దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోలు ఫిక్స్ అయ్యారు. కాకపోతే అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదంతే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని, శర్వానంద్ హీరోలుగా నటించబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దర్నే హీరోలుగా పెట్టి, ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఇక సినిమా మంచి ఎంట్రటైన్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సాగబోతుందట.
ట్విస్ట్ ఏంటంటే..ఈ సినిమాల విశ్రాంతి వరకు ఎవరు హీరో అన్న విషయం సస్పెన్స్ తో ఉండబోతుందట. అంతే కాదు ఈ సినిమాలో ఇద్దరూ కొంత సమయం వరకు నెగిటీవ్ షేడ్స్ లోనే ఉంటారని సమాచారం. హీరో ఎవరనే విషయం సెకండాఫ్ లో రివీల్ అవుతుందట.సాంకేతికంగా ఈ సినిమాలో పెద్దగా మార్పుచేర్పులు ఉండవని తెలుస్తోంది. రెగ్యులర్ గా ఇంద్రగంటి సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్లే దీనికి కూడా వర్క్ చేస్తారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్