కేన్సర్ రోగులను పరామర్శించిన జగపతిబాబు
- July 15, 2018
విజయవాడ: ప్రముఖ సినీనటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడలో పర్యటించారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు. లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ దశలో ఉన్న రోగులను జగపతిబాబు పలకరించారు. క్యాన్సర్ రోగులకు రూట్స్ ఫౌండేషన్ ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం జీవించే ఈ పరిస్థితుల్లో ఇలా స్వచ్చందంగా సేవ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. చివరి రోజులు గడుపుతున్న క్యాన్సర్ రోగుల బాధను పంచుకుని వారకి అండగా ఉంటున్న ఈ స్వచ్చంద సంస్థ సభ్యులు అభినందిస్తున్నట్టు చెప్పారు.
రోజులు లెక్కపెట్టుకుంటూ బతకడం ఎంత కష్టమో అందరికీ తెలుసని.. ఇలాంటి స్వచ్చంద సంస్థలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'సైరా' చిత్రంలో జగపతిబాబు నటిస్తున్నారు. అయినప్పటికీ ఆదివారం తన షూటింగ్ను సర్దుబాటు చేసుకుని మరి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చివరి రోజులు గడుపుతున్న కేన్సర్ బాధితులకు అండగా నిలబడి సేవ చేస్తున్న రూట్స్ ఫౌండేషన్ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని జగపతిబాబు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







