ఇరాక్ లో కొనసాగుతున్న ఆందోళనలు
- July 17, 2018
బాగ్దాద్ : ఇరాక్లోని బాస్రా ప్రావిన్స్లో ఆందోళనలు కొనసాగు తున్నాయి. యువతకు ఉద్యోగ అవ కాశాలు, నాణ్యమైన సేవలు అందిం చుటలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు గళమెత్తారు. ప్రాథ మిక అవసరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ నిరసనకారులు విమర్శించారు. ఈనెల8న బాస్రాలోని జుబెయిర్ ఆయిల్ఫీల్డ్ వద్ద నిరసన కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి.
ఆయిల్ఫీల్డ్ కార్మికులు నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ ఆందోళన కార్యక్రమాల అణచివేత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న ప్రత్యేక బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టారు. బాష్పవాయుగోళాలు ప్రదర్శించారు. 9రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో మంగళవారం నాటికి ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







