ఇరాక్ లో కొనసాగుతున్న ఆందోళనలు
- July 17, 2018
బాగ్దాద్ : ఇరాక్లోని బాస్రా ప్రావిన్స్లో ఆందోళనలు కొనసాగు తున్నాయి. యువతకు ఉద్యోగ అవ కాశాలు, నాణ్యమైన సేవలు అందిం చుటలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు గళమెత్తారు. ప్రాథ మిక అవసరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ నిరసనకారులు విమర్శించారు. ఈనెల8న బాస్రాలోని జుబెయిర్ ఆయిల్ఫీల్డ్ వద్ద నిరసన కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి.
ఆయిల్ఫీల్డ్ కార్మికులు నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ ఆందోళన కార్యక్రమాల అణచివేత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న ప్రత్యేక బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టారు. బాష్పవాయుగోళాలు ప్రదర్శించారు. 9రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో మంగళవారం నాటికి ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







