ఇరాక్ లో కొనసాగుతున్న ఆందోళనలు
- July 17, 2018
బాగ్దాద్ : ఇరాక్లోని బాస్రా ప్రావిన్స్లో ఆందోళనలు కొనసాగు తున్నాయి. యువతకు ఉద్యోగ అవ కాశాలు, నాణ్యమైన సేవలు అందిం చుటలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు గళమెత్తారు. ప్రాథ మిక అవసరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ నిరసనకారులు విమర్శించారు. ఈనెల8న బాస్రాలోని జుబెయిర్ ఆయిల్ఫీల్డ్ వద్ద నిరసన కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి.
ఆయిల్ఫీల్డ్ కార్మికులు నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ ఆందోళన కార్యక్రమాల అణచివేత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న ప్రత్యేక బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టారు. బాష్పవాయుగోళాలు ప్రదర్శించారు. 9రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో మంగళవారం నాటికి ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!