ఉక్రెయిన్ వెళ్తున్న హీరో విక్రం,హీరోయిన్ కీర్తి
- July 17, 2018
చెన్నై: 'సామి' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విక్రం.. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'స్వామి స్క్వేర్' అని పేరు పెట్టారు. హరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఐశ్వర్యా రాజేష్లు కథానాయికలుగా నటించారు. తొలిభాగంలో త్రిష పోషించిన పాత్రను ఐశ్వర్యా రాజేష్ కొనసాగిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాబిసింహా విలన్గా నటిస్తున్నారు. దిల్లీ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా.. రెండో షెడ్యూల్ను ఇటీవల చెన్నైలో తెరకెక్కించారు. ఇందులో విక్రం, ఐశ్వర్యా రాజేష్కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారు. ఇదిలా ఉండగా యుగళ గీతాలకు సంబంధించి విక్రం, కీర్తి సురేష్లు ఉక్రెయిన్కు వెళ్లనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ రెండు పాటలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆగస్టు ఆఖరులో పాటలను విడుదల చేడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబరులో సినిమాను తెరపైకి తీసుకురానున్నారు.ఈ చిత్రాన్ని తమీమ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!