నేనేం తప్పు చేయలేదు:యాంకర్ అనసూయ
- July 19, 2018
యాంకర్ కం.. నటి అనసూయపై మరోసారి నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఇందులో ఆమె తప్పు ఏమి లేకపోయినా.. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్ల నుంచి అనసూయ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.అసలు వివరాల్లోకి వెళితే యాంకర్ అనసూయ నిన్న(బుధవారం) హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 గుండా వెళుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును దాటాడు. అయితే అతను డ్రైవింగ్ సమయంలో మొబైల్ లో వీడియోలు చూస్తున్నాడు. దీంతో అనసూయ ఈ తతంగాన్ని వీడియో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది.
'డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను భయపెట్టిస్తున్నాయి. ఇంతకు ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్ని వదలొద్దు.రోడ్లపైకొచ్చి తమకిష్ట మొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని అనసూయ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ వీడియో సందేశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. చీప్ పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆమె ఇలా చేస్తోందని పలువురు ట్రోల్ చేస్తూ.. రీట్వీట్లు చేశారు. అయితే వీటిని తాను పట్టించుకోనని.. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే అని వారికీ రీట్వీట్ చేశారు అనసూయ.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







