అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదం..

- December 13, 2015 , by Maagulf
అయ్యప్ప భక్తుల  బస్సు ప్రమాదం..

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిమళకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద లోయలో పడిపోయింది. దీంతో అనకాపల్లికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గాయపడ్డ పలువురు అయ్యప్ప భక్తులు అనకాపల్లిలోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ల ద్వారా సమాచారమందించారు. కాగా... విషయం తెలుసుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడమేగాక క్షతగాత్రులకు వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com