కాల్‌మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్‌..

- December 13, 2015 , by Maagulf
కాల్‌మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్‌..

కాల్‌మనీ కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్తను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని యలమంచిలి రాము సతీమణి కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ వేశారు. కాగా రాము తమ వద్ద లేడని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెబుతున్నారు. కాల్‌మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్‌, చెన్నుపాటి శ్రీనుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కాల్‌మనీ ఆఫీసులో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగిరం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com