హైదరాబాద్:కరక్కాయల కేసులో కొత్త కోణాలు
- July 19, 2018
కరక్కాయల స్కాంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంత ఎక్కువ మందితో పొడి చేయిస్తే అంత ఎక్కువ లాభాలు అంటూ ప్రచారం చేయడంతో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. బాధితులంతా పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నారు. మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకూ 5 కోట్ల రూపాయల స్కాం అన్నారు. కానీ బాధితుల సంఖ్య 600 నుంచి 700 వరకు ఉండడంతో 7 కోట్ల వరకూ స్కాం వెళ్లింది. కస్టమర్లకు ఓ ఐటీ నెంబర్ కేటాయించి, ఎక్కువ మందిని చేర్చుకోవడం ద్వారా కంపెనీ టర్నోవర్ను ఎంత పెంచితే లాభాలు అంతగా పెంచుకోవచ్చని, మీ కింద చేరిన సభ్యులకు లాభాల్లో వాటా ఉండదని, వాళ్లకు కేజీకి 300 చెల్లిస్తే చాలంటూ బుకాయించారు.
ఈ ఆఫర్ నచ్చడంతో బాధితులు తమకు తెలిసిన వారిని పదుల సంఖ్యలో సభ్యులుగా చేర్పించారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి తమ పూచీకత్తుపై కంపెనీలో ఒక్కో బాధితుడు 2 లక్షల నుంచి 25 లక్షల వరకు డిపాజిట్ చేయించారు. వారికి సాఫ్ట్ ఇంటర్గ్రేడ్ మల్టీటూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ధృవపత్రాన్ని, ఆ కంపెనీకి ప్రభుత్వ అనుమతి ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్ పేపర్ ఇచ్చి నిర్వాహకులు బురిడీ కొట్టించారు.
కరక్కాయల కంపెనీలో మేనేజర్గా పనిచేసిన మల్లికార్జున్, సంస్థ అధినేతగా చెప్పుకున్న దేవరాజ్ అనిల్కుమార్ స్వస్థలం నెల్లూరుగా తేలింది. వారి కోసం 2 బృందాలు గాలిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







