సాంకేతిక సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథం
- July 23, 2018
అబుదాబీ కమర్షియల్ బ్యాంక్ స్టేషన్ (కరామా) మరియు బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ స్టేషన్ మధ్య రెడ్ లైన్ మెట్రో సర్వీసులకు కలిగిన సాంకేతిక అంతరాయం తొలగిపోయిందని ఆర్టిఎ వెల్లడించింది. దుబాయ్ మెట్రో సకాలంలో సమస్యను గుర్తించి, పరిష్కరించినందుకుగాను ఆర్టిఎ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో ప్రయాణీకుల సహకారం మరువలేనిదని ఆర్టిఎ ట్విట్టర్లో వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యతో దుబాయ్లో మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం తలెత్తింది. సాంకేతిక కారణాలతో అబుదాబీ కమర్షియల్ బ్యాంక్ స్టేషన్ - బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ స్టేషన్ మార్గంలో ఎండు వైపులా మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి. మెట్రో సేవల అంతరాయం పట్ల చింతిస్తున్నట్లు ఆర్టిఎ పేర్కొంది. సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథంగా నడిచాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







