సాంకేతిక సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథం
- July 23, 2018
అబుదాబీ కమర్షియల్ బ్యాంక్ స్టేషన్ (కరామా) మరియు బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ స్టేషన్ మధ్య రెడ్ లైన్ మెట్రో సర్వీసులకు కలిగిన సాంకేతిక అంతరాయం తొలగిపోయిందని ఆర్టిఎ వెల్లడించింది. దుబాయ్ మెట్రో సకాలంలో సమస్యను గుర్తించి, పరిష్కరించినందుకుగాను ఆర్టిఎ కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో ప్రయాణీకుల సహకారం మరువలేనిదని ఆర్టిఎ ట్విట్టర్లో వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యతో దుబాయ్లో మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం తలెత్తింది. సాంకేతిక కారణాలతో అబుదాబీ కమర్షియల్ బ్యాంక్ స్టేషన్ - బుర్జ్ ఖలీఫా / దుబాయ్ మాల్ స్టేషన్ మార్గంలో ఎండు వైపులా మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి. మెట్రో సేవల అంతరాయం పట్ల చింతిస్తున్నట్లు ఆర్టిఎ పేర్కొంది. సమస్య పరిష్కారం తర్వాత మెట్రో సర్వీసులు యధాతథంగా నడిచాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







