తెలుగు ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్
- July 25, 2018
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనలో అందర్ని ఆక్టుకుంది. దీంతో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఐతే, టాలీవుడ్ లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని జాన్వీని కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచిస్తున్నట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల నిర్మాత దిల్ రాజు తో చర్చలు కూడా జరిపారని చెప్పుకొంటున్నారు.
మరోవైపు, రాజమౌళి మల్టీస్టారర్ తో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుందని ప్రచారం జరుగుతోంది. తారక్, చరణ్ లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా జాన్వీని తీసుకొన్నారంట జక్కన్న. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లోనూ రిలీజ్ కాబోతుండటంతో.. ఇందులో నటించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







