ఉగాండాకు భారీ సాయం ప్రకటించిన మోదీ
- July 25, 2018
కంపాలా: ఉగండా పార్లమెంట్లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆఫ్రికా ముత్యం ఉగండా అని ఆయన అన్నారు. దేశంలో సుసంపన్న వారతస్వం, సహజ సంపదలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య అనేక సంబంధాలు ఉన్నట్లు మోదీ తెలిపారు. జింజాలో గాంధీ విగ్రహం వద్ద గాంధీ స్మారక కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. మానవులకు విముక్తి, గౌరవం, సమానత్వం ఇవ్వడమే స్వాతంత్ర ఉద్యమ ఉద్దేశమని, ఆఫ్రికాలో ఇది అవసరరం అన్నారు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న స్థానిక తెగలకు తాము అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు. ఆఫ్రికాతో భాగస్వామ్యం నెలకొల్పడం గర్వంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆఫ్రికా ఖండంలో ఉగండా కీలక దేశమని, ఈ దేశానికి అనేక ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మోదీ చెప్పారు. విద్యుత్తు లైన్ల కోసం 141 మిలియన్ల డాలర్లు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. వ్యవసాయ కోసం మరో 64 మిలియన్ల డాలరలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పది సూత్రాల ఆధారంగా ఆఫ్రికా దేశాలతో సంబంధాలు నెలకొల్పుతామని మోదీ అన్నారు. ఆఫ్రికాకు తమ ఎజెండాలో అగ్ర స్థానాన్ని కల్పిస్తామన్నారు.
స్థానికంగా అవకాశాలు క్రియేట్ చేసేందుకు సహకరిస్తామన్నారు.ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టే విధంగా తమ వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. ఆఫ్రికాలో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉందని, కానీ ఆ ఖండం నుంచి కేవలం 10 శాతం మాత్రమే ఔట్పుట్ వస్తుందని మోదీ అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం నిరోధంలోనూ కలిసి పనిచేస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!