ఉగాండాకు భారీ సాయం ప్రకటించిన మోదీ
- July 25, 2018
కంపాలా: ఉగండా పార్లమెంట్లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆఫ్రికా ముత్యం ఉగండా అని ఆయన అన్నారు. దేశంలో సుసంపన్న వారతస్వం, సహజ సంపదలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య అనేక సంబంధాలు ఉన్నట్లు మోదీ తెలిపారు. జింజాలో గాంధీ విగ్రహం వద్ద గాంధీ స్మారక కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. మానవులకు విముక్తి, గౌరవం, సమానత్వం ఇవ్వడమే స్వాతంత్ర ఉద్యమ ఉద్దేశమని, ఆఫ్రికాలో ఇది అవసరరం అన్నారు. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న స్థానిక తెగలకు తాము అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు. ఆఫ్రికాతో భాగస్వామ్యం నెలకొల్పడం గర్వంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆఫ్రికా ఖండంలో ఉగండా కీలక దేశమని, ఈ దేశానికి అనేక ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మోదీ చెప్పారు. విద్యుత్తు లైన్ల కోసం 141 మిలియన్ల డాలర్లు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. వ్యవసాయ కోసం మరో 64 మిలియన్ల డాలరలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పది సూత్రాల ఆధారంగా ఆఫ్రికా దేశాలతో సంబంధాలు నెలకొల్పుతామని మోదీ అన్నారు. ఆఫ్రికాకు తమ ఎజెండాలో అగ్ర స్థానాన్ని కల్పిస్తామన్నారు.
స్థానికంగా అవకాశాలు క్రియేట్ చేసేందుకు సహకరిస్తామన్నారు.ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టే విధంగా తమ వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. ఆఫ్రికాలో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉందని, కానీ ఆ ఖండం నుంచి కేవలం 10 శాతం మాత్రమే ఔట్పుట్ వస్తుందని మోదీ అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం నిరోధంలోనూ కలిసి పనిచేస్తామన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







