సాక్ష్యం షోస్ మొదలయ్యాయి..
- July 26, 2018
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ - పూజా హగ్దే జంటగా శ్రీవాస్ డైరెక్షన్లో అభిషేక్ నామా నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. ఖర్మ సిద్ధాంతం నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగట్టే ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అభిషేక్ , ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఉదయం 8:45 పడాల్సిన షోలు ఆగిపోయాయి. మిగతా షోలు కూడా రద్దైయే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ , ప్రస్తుతం అభిషేక్ , ఫైనాన్షియర్ల మధ్య బేరసారాలు జరిగాయని , దీంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోలు మొదలు అయ్యినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్ తో పాటు అన్ని నగరాల్లో 11 గంటల షోస్ మొదలు అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ అంత ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రూ. 40 కోట్ల భారీ ఖర్చు తో ఈ మూవీ ని అభిషేక్ నిర్మించగా , ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ "ఎరోస్" సొంతం చేసుకొంది. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని , వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని , బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్తంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్స్ లలో చెప్పడం జరిగింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







