'స్త్రీ' ట్రైలర్ విడుదల
- July 27, 2018
శ్రద్ధా కపూర్..'స్త్రీ' ట్రైలర్ విడుదల ముంబయి: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'స్త్రీ'. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కుమార్ రావ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఒక ఊరిలో ఉన్నట్టుండి మగవాళ్లంతా మాయమైపోతుంటారు. వారు కన్పించకుండాపోయిన ప్రదేశంలో దుస్తులు లభ్యమవుతుంటాయి. తీరా చూస్తే వారిని కిడ్నాప్ చేస్తోంది ఒక స్త్రీ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ ఓ యువతిపై అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె కేవలం ఊర్లో జరిగే పండుగల సమయంలోనే కన్పిస్తుంటుంది. మిగతా సమయాల్లో ఎవ్వరికీ కన్పించదు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమెకు ఏం కావాలి? అన్నదే కథ.
ఇందులో స్త్రీ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించారు. హార్రర్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రీకరణ మొత్తం మధ్యప్రదేశ్లోని చందేరీ ప్రాంతంలో జరిగింది. ఆగస్టు 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాతో పాటు శ్రద్ధా తెలుగులో 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క హిందీలో 'బత్తి గుల్ మీటర్ చాలూ', ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్లోనూ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







