'స్త్రీ' ట్రైలర్ విడుదల
- July 27, 2018
శ్రద్ధా కపూర్..'స్త్రీ' ట్రైలర్ విడుదల ముంబయి: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'స్త్రీ'. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కుమార్ రావ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఒక ఊరిలో ఉన్నట్టుండి మగవాళ్లంతా మాయమైపోతుంటారు. వారు కన్పించకుండాపోయిన ప్రదేశంలో దుస్తులు లభ్యమవుతుంటాయి. తీరా చూస్తే వారిని కిడ్నాప్ చేస్తోంది ఒక స్త్రీ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ ఓ యువతిపై అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె కేవలం ఊర్లో జరిగే పండుగల సమయంలోనే కన్పిస్తుంటుంది. మిగతా సమయాల్లో ఎవ్వరికీ కన్పించదు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమెకు ఏం కావాలి? అన్నదే కథ.
ఇందులో స్త్రీ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించారు. హార్రర్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రీకరణ మొత్తం మధ్యప్రదేశ్లోని చందేరీ ప్రాంతంలో జరిగింది. ఆగస్టు 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాతో పాటు శ్రద్ధా తెలుగులో 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క హిందీలో 'బత్తి గుల్ మీటర్ చాలూ', ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్లోనూ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







