ఆఫ్గనిస్తాన్:ప్రార్థనా స్థలంలో ఆత్మాహుతి దాడి, 20 మంది మృతి
- August 03, 2018
అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు మరోసారి రక్తపాతాన్ని సృష్టించారు. ఓ ప్రార్థనా మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ బాంబు పేలుళ్లలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్అధికారులు వెల్లడించారు.
అప్ఘాన్ లోని పక్టియా ప్రావిన్స్ లోని గార్డేజ్ సిటీలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇవాళ శుక్రవారం కావడంతో ప్రార్థనలు చేయడానికి మసీదులకు భారీ సంఖ్యలో ప్రజలువస్తారు. దీంతో వీరిని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది. అందరు ప్రార్థనలు చేస్తుండగా హటాత్తుగా వారి మధ్యలోకి వెళ్లిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈపేలుళ్లలో ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రుల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుతెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఎవరూప్రకటించలేదు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







