సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు..వాతావరణ ప్రతికూలత..సహాయక చర్యలకు విఘాతం

- August 04, 2018 , by Maagulf
సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు..వాతావరణ ప్రతికూలత..సహాయక చర్యలకు విఘాతం

మానస సరోవర్ యాత్రకు వెళ్లి సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వాతావరణ ప్రతికూలత అడ్డంకిగా మారింది. సిమికోట్ నుంచి వారిని నేపాల్ కు తరలించేందుకు విమానాలను ఉపయోగించాలంటే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగడం లేదు. వాతావరణం అనుకూలించగానే యాత్రికులను విమానాల ద్వారా నేపాల్ కు చేర్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ అధికారులు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సిమికోట్ లో చిక్కుకున్న యాత్రికులకు ఆహారం, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా సిమికోట్ లో చిక్కుకున్న యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com