సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు..వాతావరణ ప్రతికూలత..సహాయక చర్యలకు విఘాతం
- August 04, 2018
మానస సరోవర్ యాత్రకు వెళ్లి సిమికోట్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వాతావరణ ప్రతికూలత అడ్డంకిగా మారింది. సిమికోట్ నుంచి వారిని నేపాల్ కు తరలించేందుకు విమానాలను ఉపయోగించాలంటే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగడం లేదు. వాతావరణం అనుకూలించగానే యాత్రికులను విమానాల ద్వారా నేపాల్ కు చేర్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ అధికారులు నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సిమికోట్ లో చిక్కుకున్న యాత్రికులకు ఆహారం, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా సిమికోట్ లో చిక్కుకున్న యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







