ఇండోనేషియాలో భారీ భూకంపం..
- August 05, 2018
జకార్తా: ఇండోనేషియా ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఇండోనేషియాకు చెందిన లాంబోక్ దీవిలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉంది. దీంతో ఇండోనేషియా విపత్తు నిర్వహణ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వారం కిందట కూడా ఇదే దీవిలో భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కంటే కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు. ఇండోనేషియాతోపాటు చుట్టుపక్కల దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే బాలిలోనూ భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







