20 నర్సరీల ప్రారంభానికి ఫ్రెంచ్ గ్రూప్ సన్నాహాలు
- December 14, 2015
బాబిలో గ్రూప్ యూఏఈలో 20 నర్సరీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 400 మంది సిబ్బందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. యూరోప్ వ్యాప్తంగా సుమారు 850 నర్సరీలను కలిగి వుంది ఈ సంస్థ. బాబిలో గ్రూప్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజర్ మాట్లాడుతూ రానున్న మూడేళ్ళలో 20 నర్సరీలను యూఏఈలో స్థాపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెనా రీజియన్లో మొత్తం 50 నర్సరీలను స్థాపించాలనే లక్ష్యం పెట్టుకున్నారట. తొలి సిగ్నేచర్ నర్సరీని దుబాయ్ డౌన్టౌన్లో ప్రారంభించారు. రెండో బ్రాంచ్ ఉమ్ సకీమ్లో రానున్న కొద్ది వారాల్లో ప్రారంబిస్తారు. ఒక్కో నర్సరీ కోసం 20 మందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. దుబాయ్ మరియు షార్జాల్లో తమ కార్యకలాపాల్ని విస్తరించాలనుకుంటున్నామనీ, 2016లో దుబాయ్లో కార్యకలాపాల్ని విస్తరించడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టామని బాబిలో గ్రూప్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









