20 నర్సరీల ప్రారంభానికి ఫ్రెంచ్ గ్రూప్ సన్నాహాలు
- December 14, 2015
బాబిలో గ్రూప్ యూఏఈలో 20 నర్సరీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 400 మంది సిబ్బందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. యూరోప్ వ్యాప్తంగా సుమారు 850 నర్సరీలను కలిగి వుంది ఈ సంస్థ. బాబిలో గ్రూప్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజర్ మాట్లాడుతూ రానున్న మూడేళ్ళలో 20 నర్సరీలను యూఏఈలో స్థాపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెనా రీజియన్లో మొత్తం 50 నర్సరీలను స్థాపించాలనే లక్ష్యం పెట్టుకున్నారట. తొలి సిగ్నేచర్ నర్సరీని దుబాయ్ డౌన్టౌన్లో ప్రారంభించారు. రెండో బ్రాంచ్ ఉమ్ సకీమ్లో రానున్న కొద్ది వారాల్లో ప్రారంబిస్తారు. ఒక్కో నర్సరీ కోసం 20 మందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. దుబాయ్ మరియు షార్జాల్లో తమ కార్యకలాపాల్ని విస్తరించాలనుకుంటున్నామనీ, 2016లో దుబాయ్లో కార్యకలాపాల్ని విస్తరించడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టామని బాబిలో గ్రూప్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







