20 నర్సరీల ప్రారంభానికి ఫ్రెంచ్ గ్రూప్ సన్నాహాలు
- December 14, 2015
బాబిలో గ్రూప్ యూఏఈలో 20 నర్సరీలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 400 మంది సిబ్బందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. యూరోప్ వ్యాప్తంగా సుమారు 850 నర్సరీలను కలిగి వుంది ఈ సంస్థ. బాబిలో గ్రూప్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజర్ మాట్లాడుతూ రానున్న మూడేళ్ళలో 20 నర్సరీలను యూఏఈలో స్థాపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెనా రీజియన్లో మొత్తం 50 నర్సరీలను స్థాపించాలనే లక్ష్యం పెట్టుకున్నారట. తొలి సిగ్నేచర్ నర్సరీని దుబాయ్ డౌన్టౌన్లో ప్రారంభించారు. రెండో బ్రాంచ్ ఉమ్ సకీమ్లో రానున్న కొద్ది వారాల్లో ప్రారంబిస్తారు. ఒక్కో నర్సరీ కోసం 20 మందిని నియమించుకోనుంది బాబిలో గ్రూప్. దుబాయ్ మరియు షార్జాల్లో తమ కార్యకలాపాల్ని విస్తరించాలనుకుంటున్నామనీ, 2016లో దుబాయ్లో కార్యకలాపాల్ని విస్తరించడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టామని బాబిలో గ్రూప్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







