గీతా ఆర్ట్స్ బేనర్లో నటించనున్నమెగా హీరోలు
- August 07, 2018
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల గీతా ఆర్ట్స్ 2 అనే సంస్థని స్థాపించి ఇందులో చిన్న సినిమాలు చేస్తున్నాడు. తాజాగా గీత గోవిందం అనే చిత్రం గీతా ఆర్ట్స్2 బేనర్పై రూపొందగా, ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కట్ చేస్తే అల్లు అరవింద్ రానున్న రోజులలో తన బేనర్పై ముగ్గురు మెగా హీరోలతో మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు చేయనున్నట్టు తెలిపాడు. చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ హీరోలుగా అల్లు అరవింద్ క్రేజీ ప్రాజెక్టులు చేయనుండగా, చిరు సినిమా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ సినిమాలకి సంబంధించిన క్లారిటీ రావలసి ఉంది. చిరు ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో పాటు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







