మలయాళ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్..
- December 14, 2015
ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వెంకటేష్ మళ్లీ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలోరిజెక్ట్ చేసిన మారుతి దర్శకత్వంలో బాబు బంగారం పేరుతో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వెంకటేష్. గతంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా రీమేక్ లో హీరోగా నటించిన వెంకీ, ఈ సారి నేరుగా జీతూ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ వర్షన్ లో హీరోను ఫైనల్ చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









