తెలంగాణకు చెందిన కొందరు యువకులు ఐసిస్ యుద్ధరంగంలో..
- December 14, 2015
ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అరవై మంది వరకు ఐసిస్ సానుభూతిపరులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారి పైన ఓ కన్నేసి పెట్టాయి. తెలంగాణలో ఐసిస్ సానుభూతిపరులు అరవై మంది ఉండగా, అందులో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఉన్నారని గుర్తించారు. వీరి పైన కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. వీరే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం ఐసిస్ కార్యకలాపాలు గమనిస్తూ, తమ అభిప్రాయాలు పంచుకుంటూ, విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారి సంఖ్య వందల్లో ఉన్నట్లుగా తేలింది. వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దాని పైన అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.దీనికి సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒక నివేదిక సమర్పించింది. ఐసిస్ దూకుడును అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో కొన్ని సూచనలు చేసింది. ఐసిస్ ఉగ్రవాదంలో పాల్గొనేందుకు వెళ్తున్న 19మంది తెలంగాణ యువతీ యువకులను గుర్తించిన నిఘా వర్గాలు వారిలో పదహారు మందిని అదుపులోకి తీసుకోగలిగారు. మిగతా ముగ్గురు వివరాలుతెలియరాలేదు. అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన మహ్మత్ అతీఫ్ వసీమ్ సిరియా యుద్ధంలో మరణించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతను, అక్కడి నుంచే సిరియా వెళ్లాడు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ మునవాద్ సల్మాన్ కూడా ఐసిస్ తరఫున పోరాడేందుకు ఇరాక్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐసిస్లో చేరేలా ప్రచారం నిర్వహిస్తున్న హైదరాబాదుకు చెందిన అఫ్సా జబీన్ను, ఆమె సహచరుడు సల్మాన్ మోహియుద్దీన్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదుకు చెందిన మరో యువతి ఆరు నెలల పాటు ఐసిస్ తరఫున ఇరాక్లో పోరాడి వెనక్కి వచ్చింది. తెలంగాణకు చెందిన కొందరు యువకులు ఐసిస్ యుద్ధరంగంలో ఉండి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







