షార్జాలో భారతీయ కార్మికుడి మృతి
- December 14, 2015
I
షార్జాలోని అల్ ఘయిల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో భారతదేశానికి చెందిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. విధి నిర్వహణలో ఉండగా స్టీల్ రాడ్ ఒకటి అతనిపై పడింది. దాంతో బాధితుడి తలభాగానికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కార్మికుల భద్రత కోసం ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. బాధితుడు ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోలేదని సహచరులు పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







