'జిడిఆర్ఎఫ్ఎ' 1 మిలియన్ ఇ-పోర్టల్ లావాదేవీలు
- December 15, 2015
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు పారినర్స్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్ (జిఆర్డిఎఫ్ఎ) ఇ-పోర్టల్ ద్వారా 1 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి చెప్పారు. రెసిడెన్సీ ఇన్స్యూరెన్స్, వర్క్ పర్మిట్స్, విజిట్ వీసా వంటివన్నీ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందని జిడిఆర్ఎఫ్ఎ ప్రతినిథులు వెల్లడించారు. జిడిఆర్ఎఫ్ఎ కార్యాలయానికి వచ్చి, గంటల తరబడి వేచి చూసి పనులు పూర్తిచేసుకునేంత కష్టం ఇప్పుడు లేదనీ, ఇంట్లోంచి, కార్యాలయాల్లోంచి అవసరమైన పనులు పూర్తి చేసుకోగలుగుతున్నామనీ, ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కార్యాలయానికి రావాల్సి వస్తుందని వినియోగదారులు చెప్పారు. ఇ-పోర్టల్తో ప్రభుత్వానికీ పని సులువయ్యిందనీ, అలాగే వినియోగదారులకూ మెరుగైన సేవల్ని అత్యంత వేగంగా అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఆన్లైన్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నామన్నారు అధికారులు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









