'జిడిఆర్ఎఫ్ఎ' 1 మిలియన్ ఇ-పోర్టల్ లావాదేవీలు
- December 15, 2015
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు పారినర్స్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్ (జిఆర్డిఎఫ్ఎ) ఇ-పోర్టల్ ద్వారా 1 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి చెప్పారు. రెసిడెన్సీ ఇన్స్యూరెన్స్, వర్క్ పర్మిట్స్, విజిట్ వీసా వంటివన్నీ ఆన్లైన్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందని జిడిఆర్ఎఫ్ఎ ప్రతినిథులు వెల్లడించారు. జిడిఆర్ఎఫ్ఎ కార్యాలయానికి వచ్చి, గంటల తరబడి వేచి చూసి పనులు పూర్తిచేసుకునేంత కష్టం ఇప్పుడు లేదనీ, ఇంట్లోంచి, కార్యాలయాల్లోంచి అవసరమైన పనులు పూర్తి చేసుకోగలుగుతున్నామనీ, ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కార్యాలయానికి రావాల్సి వస్తుందని వినియోగదారులు చెప్పారు. ఇ-పోర్టల్తో ప్రభుత్వానికీ పని సులువయ్యిందనీ, అలాగే వినియోగదారులకూ మెరుగైన సేవల్ని అత్యంత వేగంగా అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఆన్లైన్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నామన్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







