వర్షాల కారణంగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

- August 13, 2018 , by Maagulf
వర్షాల కారణంగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం జమ్మూలో అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో భగవతి నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి యాత్రను రద్దు చేశామని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి యాత్రికులను అమర్‌నాథ్‌ వైపు అనుమతించలేదని చెప్పారు. జూన్‌ 28న రెండు మార్గాల్లో ప్రారంభమైన 60 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 26న రక్షా బంధన్‌ రోజు ముగియనుంది. ఉగ్ర దాడుల హెచ్చరికలతో యాత్ర సాగే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com