ప్రాణాలుతీసే మరో ‘బ్లూవేల్’ తరహా గేమ్.. మీ పిల్లలు జాగ్రత్త!
- August 13, 2018
సరదాగా ఆడుకోవాల్సిన గేమ్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. మొన్నటి వరకు భయపెట్టిన బ్లూవేల్ మానియా తగ్గింది కదా అనుకుంటే మరో కొత్త గేమ్ వచ్చింది అదే మోమో ఛాలెంజ్. ఇప్పటికే ఈ గేమ్ బారిన పడి ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వ్యాపిస్తున్న ఈ గేమ్ యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో విస్తరించింది. ప్రత్యేక లింక్ల ద్వారా భారత్కి కూడా వ్యాపించింది.
ఈ గేమ్లో కూడా బ్లూవేల్ తరహాలోనే కొన్ని టాస్కులు చేయవలసి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు, బెదిరింపులు వస్తుంటాయి. భయంకరంగా ఉన్న శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న విచిత్ర ఆకారం పేరే ‘మోమో’. జపాన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్ ద్వారా ఈ ఇమేజ్ని రూపొందిస్తే మరో కంపెనీ దీన్ని వాడుకుంది మోమో గేమ్ కోసం. అర్జెంటీనాకు చెందిన ఓ చిన్నారి ఇప్పటికే ఈ గేమ్కు బలైంది. తన వాట్సాప్లో గేమ్కు సంబంధించిన వీడియోలు వుండడంతో ఈ గేమే ఆమె ప్రాణాలు తీసిందని నిర్ధారించుకున్నారు పోలీసులు. టీనేజ్ యువతీ యువకులను టార్గెట్ చేసి రూపొందించిన ఈ గేమ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







