ప్రాణాలుతీసే మరో ‘బ్లూవేల్’ తరహా గేమ్.. మీ పిల్లలు జాగ్రత్త!
- August 13, 2018
సరదాగా ఆడుకోవాల్సిన గేమ్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. మొన్నటి వరకు భయపెట్టిన బ్లూవేల్ మానియా తగ్గింది కదా అనుకుంటే మరో కొత్త గేమ్ వచ్చింది అదే మోమో ఛాలెంజ్. ఇప్పటికే ఈ గేమ్ బారిన పడి ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వ్యాపిస్తున్న ఈ గేమ్ యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో విస్తరించింది. ప్రత్యేక లింక్ల ద్వారా భారత్కి కూడా వ్యాపించింది.
ఈ గేమ్లో కూడా బ్లూవేల్ తరహాలోనే కొన్ని టాస్కులు చేయవలసి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు, బెదిరింపులు వస్తుంటాయి. భయంకరంగా ఉన్న శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న విచిత్ర ఆకారం పేరే ‘మోమో’. జపాన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్ ద్వారా ఈ ఇమేజ్ని రూపొందిస్తే మరో కంపెనీ దీన్ని వాడుకుంది మోమో గేమ్ కోసం. అర్జెంటీనాకు చెందిన ఓ చిన్నారి ఇప్పటికే ఈ గేమ్కు బలైంది. తన వాట్సాప్లో గేమ్కు సంబంధించిన వీడియోలు వుండడంతో ఈ గేమే ఆమె ప్రాణాలు తీసిందని నిర్ధారించుకున్నారు పోలీసులు. టీనేజ్ యువతీ యువకులను టార్గెట్ చేసి రూపొందించిన ఈ గేమ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







