ప్రాణాలుతీసే మరో ‘బ్లూవేల్’ తరహా గేమ్.. మీ పిల్లలు జాగ్రత్త!
- August 13, 2018సరదాగా ఆడుకోవాల్సిన గేమ్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. మొన్నటి వరకు భయపెట్టిన బ్లూవేల్ మానియా తగ్గింది కదా అనుకుంటే మరో కొత్త గేమ్ వచ్చింది అదే మోమో ఛాలెంజ్. ఇప్పటికే ఈ గేమ్ బారిన పడి ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వ్యాపిస్తున్న ఈ గేమ్ యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో విస్తరించింది. ప్రత్యేక లింక్ల ద్వారా భారత్కి కూడా వ్యాపించింది.
ఈ గేమ్లో కూడా బ్లూవేల్ తరహాలోనే కొన్ని టాస్కులు చేయవలసి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు, బెదిరింపులు వస్తుంటాయి. భయంకరంగా ఉన్న శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న విచిత్ర ఆకారం పేరే ‘మోమో’. జపాన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్ ద్వారా ఈ ఇమేజ్ని రూపొందిస్తే మరో కంపెనీ దీన్ని వాడుకుంది మోమో గేమ్ కోసం. అర్జెంటీనాకు చెందిన ఓ చిన్నారి ఇప్పటికే ఈ గేమ్కు బలైంది. తన వాట్సాప్లో గేమ్కు సంబంధించిన వీడియోలు వుండడంతో ఈ గేమే ఆమె ప్రాణాలు తీసిందని నిర్ధారించుకున్నారు పోలీసులు. టీనేజ్ యువతీ యువకులను టార్గెట్ చేసి రూపొందించిన ఈ గేమ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ