దుబాయ్:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి
- August 13, 2018
దుబాయ్: జబెల్ అలిలోని ఓ అల్యూమినియం కంపెనీ ఫర్నేస్లో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నేస్ వద్ద పనిచేస్తున్న సమయంలో, కొన్ని బ్రిక్స్ వారి తల మీద పడటంతో, ఇద్దరు వ్యక్తులు ఫర్నేస్లో పడి ప్రాణాలు కోల్పోయారు. జబెల్ అలి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, క్రైమ్ సీన్ ఆఫీసర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫర్నేస్లోని అతి శక్తివంతమైన మంటల కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించామనీ, ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!







