కొచ్చి ఎయిర్పోర్ట్ లో సేవలు పునప్రారంభం

- August 19, 2018 , by Maagulf
కొచ్చి ఎయిర్పోర్ట్ లో సేవలు పునప్రారంభం

తిరువనంతపురం : కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. నావికాదళ ఎయిర్‌స్టేషన్‌లో విమాన కార్యకలాపాలను కేంద్రం, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఉమ్మడి బృందం నిర్ణయించిందని కమాండర్‌ శ్రీధర్‌ వారియర్‌ వెల్లడించారు. నావికా ఎయిర్‌స్టేషన్‌ వద్ద మొట్టమొదటి విమానం ఐఎన్‌ఎస్‌ గరుడా విమానం ల్యాండ్‌ అయింది. బెంగుళూరు నుండి 70 సీట్లతో కూడిన ఎయిర్‌ఇండియా అనుబంధ సంస్థకు చెందిన ఎలైన్స్‌ ఎయిర్‌ విమానం కొచ్చిలో ల్యాండ్‌ అయినట్లు తెలిపారు. మధురై, కోయంబత్తూర్‌ల నుండి త్వరలో సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. విమానం గతంలో విమానాశ్రయం కూడా నీటిలో మునిగిపోవడంతో ఆగస్ట్‌ 26 వరకు కార్యక్రమాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వర్షపాతం గత మూడు రోజుల నుండి క్రమంగా తగ్గుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. శిబిరాలలో ఉన్నవారికి ఆహారంతో పాటు మందులను అందించేందుకు సహాయక బృందాలు సమాయత్తమౌతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com