కేరళ వరద బాధితుల కోసం ఏ.ఆర్.ఆర్ మ్యూజికల్ షో
- August 24, 2018
హైదరాబాద్: కేరళ వరద బాధితులకు సహాయాన్ని అందించేందుకు ఎస్కే మోహియోద్దీన్ మెమోరియల్ ట్రస్ట్, మూవీస్ ఇంటర్నేషనల్స్, ఎస్కే ఫిలీంస్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20వ తేదీన ఎల్బీస్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సినీహీరో, ఎస్కే మోహియోద్దీన్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ హబీబుద్దీన్ తెలిపారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ఫిలిం అసోసియేషన్ సమక్షంలో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ ప్రముఖ సినీ హీరోలు సల్మాన్ఖాన్, షారూఖ్ఖాన్, అమీర్ఖాన్, అక్షయ్కుమార్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మమ్ముట్టి, దుల్హర్ సాల్మన్, మోహన్లాల్, విశాల్, సూర్య, విక్రమ్, అజిత్, పునీత్రాజ్ కుమార్, ఉపేంద్ర, చరణ్రాజ్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కనీస ఎంట్రీ ధర రూ.1000 ఉంటుందని, దాతలు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంతో దాదాపు ఒక కోటీ రూపాయలు విరాళాలను సేకరించి సీఎం రిలీఫ్ఫండ్కు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై బాధితులకు విరాళాలు అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







