హైదరాబాద్:డ్రంకెన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన యువతులు
- August 24, 2018
హైదరాబాద్లో అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు యువతులు రెచ్చిపోయారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్కు సహకరించకుండా ట్రాఫిక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా చిందులు వేశారు.
వెస్ట్జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ఆరు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు యువతులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్కు సహకరించకుండా… కొద్దిసేపు నడిరోడ్డుపై హల్చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. చివరకు ఎలాగోలా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు… ముగ్గురు యువతులు మద్యం సేవించినట్లు నిర్ధారించారు. వీరిలో ఓ అమ్మాయికి ఏకంగా 192 పాయింట్లు రావడంతో… ఖాకీలే షాకయ్యారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్జోన్ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు… మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు. 20 కార్లతో పాటు 10 టూవీలర్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







