హైదరాబాద్:డ్రంకెన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన యువతులు
- August 24, 2018
హైదరాబాద్లో అర్ధరాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు యువతులు రెచ్చిపోయారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్కు సహకరించకుండా ట్రాఫిక్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా చిందులు వేశారు.
వెస్ట్జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ఆరు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు యువతులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్కు సహకరించకుండా… కొద్దిసేపు నడిరోడ్డుపై హల్చల్ చేశారు. మద్యం మత్తులో పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. చివరకు ఎలాగోలా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు… ముగ్గురు యువతులు మద్యం సేవించినట్లు నిర్ధారించారు. వీరిలో ఓ అమ్మాయికి ఏకంగా 192 పాయింట్లు రావడంతో… ఖాకీలే షాకయ్యారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్జోన్ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు… మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు. 20 కార్లతో పాటు 10 టూవీలర్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







