పసిడి ధర తగ్గించేందుకు...
- August 24, 2018
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర ఎక్కువగా ఉండటంతో ఈ ధరను తగ్గించేందుకు కేంద్రానికి నీతి ఆయోగ్ సూచనలు చేసింది. నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు రతన్ పి వాతల్ నేతృత్వంలోని కమిటీ ఈ సిఫారసులు చేసింది. గోల్డ్పై దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీని కూడా విధిస్తున్నారని, దీంతో దొంగచాటుగా దేశీయ మార్కెట్లోకి బంగారం వస్తోందని, దీనిని అరికట్టేందుకు వెంటనే పన్నులను తగ్గించాల్సిందేనని సూచించింది.
పసిడి నగదీకరణ, సార్వభౌమ పసిడి బాండ్ల పథకాలను కూడా సమీక్షించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బంగారంపై 10శాతం దిగుమతి సుంకం, 3శాతం జీఎస్టీని విధిస్తున్నారు. పన్నులు తగ్గిస్తే స్మగ్లింగ్ను నిరోధించే అవకాశముందని తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







