పసిడి ధర తగ్గించేందుకు...
- August 24, 2018
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర ఎక్కువగా ఉండటంతో ఈ ధరను తగ్గించేందుకు కేంద్రానికి నీతి ఆయోగ్ సూచనలు చేసింది. నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు రతన్ పి వాతల్ నేతృత్వంలోని కమిటీ ఈ సిఫారసులు చేసింది. గోల్డ్పై దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీని కూడా విధిస్తున్నారని, దీంతో దొంగచాటుగా దేశీయ మార్కెట్లోకి బంగారం వస్తోందని, దీనిని అరికట్టేందుకు వెంటనే పన్నులను తగ్గించాల్సిందేనని సూచించింది.
పసిడి నగదీకరణ, సార్వభౌమ పసిడి బాండ్ల పథకాలను కూడా సమీక్షించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బంగారంపై 10శాతం దిగుమతి సుంకం, 3శాతం జీఎస్టీని విధిస్తున్నారు. పన్నులు తగ్గిస్తే స్మగ్లింగ్ను నిరోధించే అవకాశముందని తెలిపింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







