సౌదీ అరేబియాలో 42 మంది పాకిస్థానీయులు మృతి
- August 25, 2018
రియాద్: హజ్ యాత్రకు వెళ్తూ సుమారు 42 మంది పాకిస్తానీలు సౌదీ అరేబియాలో మృతి చెందారని పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, రద్దీతో ఊపిరాడక మరికొందరు మరణించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో 12 మంది మహిళలు కాగా 30 మంది మగవారు ఉన్నారు. అయితే వీరంతా 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయసువారే. ఈ యేడాదిలో మొత్తం 1,84,210 మంది పాకిస్తాన్కు యాత్రికులు హజ్ను దర్శించడానికి సౌదీ అరేబియా చేరుకున్నారని పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది కూడా ఇలాంటి దుర్ఘటనే ఒకటి సౌది అరేబియాలో చోటు చేసుకుంది. ఈజిప్టుకు చెందిన సుమారు 35 మంది హజ్ యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు. కాగా ఈ మృతులంతా 60 నుంచి 85 ఏళ్ల వయసువారే.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







