ఇరాన్:బాయిలర్ పేలి 10 మంది మృతి
- August 25, 2018
ఇరాన్:బాయిలర్ పేలి పది మంది మృతి టెహ్రాన్: గ్యాస్తో నడిచే బాయిలర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇరాన్లోని మాషద్ నగరంలో జరిగింది. బాయిలర్ పేలడం వల్ల భవనమే ధ్వంసమైపోయిందని, దీంతో పది మంది చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. గ్యాస్తో నడిచే స్టోరేజి వాటర్ హీటర్ పేలడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఇరాన్లో ఎక్కువగా ఈ తరహా బాయిలర్స్ను వినియోగిస్తుంటారు. గతంలో కూడా అవి పేలిన ఘటనలు ఉన్నాయి. గ్యాస్ లీకేజీ వల్ల ఎక్కువగా పేలుళ్లు జరుగుతుంటాయి. దేశ రాజధానికి దాదాపు 900కిలోమీటర్ల దూరంలో మాషద్ నగరంలో ఈరోజు ఉదయం పేలుడు జరిగినట్లు వైజేసీ.ఐఆర్ న్యూస్ అనే వెబ్సైట్ ప్రచురించింది. రెండస్తుల భవనంలో పేలుడు జరగడంతో అది కుప్పకూలినట్లు తెలిపింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతిచెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియలేదు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







