ఇరాన్:బాయిలర్ పేలి 10 మంది మృతి
- August 25, 2018
ఇరాన్:బాయిలర్ పేలి పది మంది మృతి టెహ్రాన్: గ్యాస్తో నడిచే బాయిలర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇరాన్లోని మాషద్ నగరంలో జరిగింది. బాయిలర్ పేలడం వల్ల భవనమే ధ్వంసమైపోయిందని, దీంతో పది మంది చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. గ్యాస్తో నడిచే స్టోరేజి వాటర్ హీటర్ పేలడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఇరాన్లో ఎక్కువగా ఈ తరహా బాయిలర్స్ను వినియోగిస్తుంటారు. గతంలో కూడా అవి పేలిన ఘటనలు ఉన్నాయి. గ్యాస్ లీకేజీ వల్ల ఎక్కువగా పేలుళ్లు జరుగుతుంటాయి. దేశ రాజధానికి దాదాపు 900కిలోమీటర్ల దూరంలో మాషద్ నగరంలో ఈరోజు ఉదయం పేలుడు జరిగినట్లు వైజేసీ.ఐఆర్ న్యూస్ అనే వెబ్సైట్ ప్రచురించింది. రెండస్తుల భవనంలో పేలుడు జరగడంతో అది కుప్పకూలినట్లు తెలిపింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతిచెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియలేదు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







