ఇరాన్:బాయిలర్‌ పేలి 10 మంది మృతి

- August 25, 2018 , by Maagulf
ఇరాన్:బాయిలర్‌ పేలి 10 మంది మృతి

ఇరాన్:బాయిలర్‌ పేలి పది మంది మృతి టెహ్రాన్‌: గ్యాస్‌తో నడిచే బాయిలర్‌ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇరాన్‌లోని మాషద్‌ నగరంలో జరిగింది. బాయిలర్‌ పేలడం వల్ల భవనమే ధ్వంసమైపోయిందని, దీంతో పది మంది చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. గ్యాస్‌తో నడిచే స్టోరేజి వాటర్‌ హీటర్‌ పేలడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఇరాన్‌లో ఎక్కువగా ఈ తరహా బాయిలర్స్‌ను వినియోగిస్తుంటారు. గతంలో కూడా అవి పేలిన ఘటనలు ఉన్నాయి. గ్యాస్‌ లీకేజీ వల్ల ఎక్కువగా పేలుళ్లు జరుగుతుంటాయి. దేశ రాజధానికి దాదాపు 900కిలోమీటర్ల దూరంలో మాషద్‌ నగరంలో ఈరోజు ఉదయం పేలుడు జరిగినట్లు వైజేసీ.ఐఆర్‌ న్యూస్‌ అనే వెబ్‌సైట్‌ ప్రచురించింది. రెండస్తుల భవనంలో పేలుడు జరగడంతో అది కుప్పకూలినట్లు తెలిపింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతిచెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com