త్వరలో మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు:డీఆర్డీవో చైర్మన్‌

- August 26, 2018 , by Maagulf
త్వరలో మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు:డీఆర్డీవో చైర్మన్‌

DRDO ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తయిన డాక్టర్ సతీష్‌ రెడ్డి నియమించింది కేంద్రం. సతీష్ ఇప్పటికే రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన DRDOకి చైర్మన్‌ అయిన సతీష్‌రెడ్డిది నెల్లూరు జిల్లా. హైదరాబాద్ JNTUలోనే ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 1985లో DRDOలో చేరారు. హైదరాబాద్ సెంటర్‌కు డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీల్లో విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆయన సేవలకు, సమర్థతకు గుర్తింపుగా ఇప్పుడు DRDO చైర్మన్ బాధ్యతలు సతీష్‌రెడ్డికి అప్పగించింది కేంద్రం. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామంటున్న సతీష్‌రెడ్డి, త్వరలో మనం మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు వాటిని అందించే స్థాయికి ఎదగాలన్న టార్గెట్‌తో పనిచేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com