త్వరలో మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు:డీఆర్డీవో చైర్మన్
- August 26, 2018
DRDO ఛైర్మన్గా తెలుగు వ్యక్తయిన డాక్టర్ సతీష్ రెడ్డి నియమించింది కేంద్రం. సతీష్ ఇప్పటికే రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన DRDOకి చైర్మన్ అయిన సతీష్రెడ్డిది నెల్లూరు జిల్లా. హైదరాబాద్ JNTUలోనే ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 1985లో DRDOలో చేరారు. హైదరాబాద్ సెంటర్కు డైరెక్టర్గానూ బాధ్యతలు నిర్వహించారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీల్లో విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆయన సేవలకు, సమర్థతకు గుర్తింపుగా ఇప్పుడు DRDO చైర్మన్ బాధ్యతలు సతీష్రెడ్డికి అప్పగించింది కేంద్రం. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామంటున్న సతీష్రెడ్డి, త్వరలో మనం మరిన్ని ప్రయోగాలు చేసి విదేశాలకు వాటిని అందించే స్థాయికి ఎదగాలన్న టార్గెట్తో పనిచేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









