ఒకే రోజు మూడు సినిమాలు...
- August 26, 2018
ఈ వినాయక చవితి కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరమంచి పోటీనే నెలకొని ఉంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా రెండు సినిమాల విషయంలో ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ రెండే సమంత నటిస్తున్న యూ టర్న్ మూవీ కాగా , మరోటి నాగ చైతన్య శైలజా రెడ్డి.
వాస్తవానికి శైలజా రెడ్డి ఆగస్టు 31 న విడుదల అవ్వాల్సి ఉండగా , రీ రికార్డు పనులు పూర్తి కాకపోయేసరికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 07 న అనుకున్నప్పటికీ ఆ రోజు మూడు నాల్గు సినిమాలు ఉండడం తో నిర్మాతలు ఆ రోజు కాకుండా సెప్టెంబర్ 13 వినాయక చవితి రోజయితే బాగుంటుందని ఆ తేదీని ఫిక్స్ చేసారు. ఇక ఆరోజు చైతు తో సమంత యూ టర్న్ తో పోటీ పడుతుంది. ఈ రెండు సినిమాలే కాదు సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రం కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో మొత్తం మీద ఈ మూడు చిత్రాల మధ్య మాత్రం విపరీతమైన పోటీ ఉండనుంది. మరి ఈ మూడిట్లో ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









