ఒకే రోజు మూడు సినిమాలు...
- August 26, 2018
ఈ వినాయక చవితి కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరమంచి పోటీనే నెలకొని ఉంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా రెండు సినిమాల విషయంలో ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ రెండే సమంత నటిస్తున్న యూ టర్న్ మూవీ కాగా , మరోటి నాగ చైతన్య శైలజా రెడ్డి.
వాస్తవానికి శైలజా రెడ్డి ఆగస్టు 31 న విడుదల అవ్వాల్సి ఉండగా , రీ రికార్డు పనులు పూర్తి కాకపోయేసరికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 07 న అనుకున్నప్పటికీ ఆ రోజు మూడు నాల్గు సినిమాలు ఉండడం తో నిర్మాతలు ఆ రోజు కాకుండా సెప్టెంబర్ 13 వినాయక చవితి రోజయితే బాగుంటుందని ఆ తేదీని ఫిక్స్ చేసారు. ఇక ఆరోజు చైతు తో సమంత యూ టర్న్ తో పోటీ పడుతుంది. ఈ రెండు సినిమాలే కాదు సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రం కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో మొత్తం మీద ఈ మూడు చిత్రాల మధ్య మాత్రం విపరీతమైన పోటీ ఉండనుంది. మరి ఈ మూడిట్లో ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







