ఒకే రోజు మూడు సినిమాలు...
- August 26, 2018ఈ వినాయక చవితి కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరమంచి పోటీనే నెలకొని ఉంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా రెండు సినిమాల విషయంలో ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ రెండే సమంత నటిస్తున్న యూ టర్న్ మూవీ కాగా , మరోటి నాగ చైతన్య శైలజా రెడ్డి.
వాస్తవానికి శైలజా రెడ్డి ఆగస్టు 31 న విడుదల అవ్వాల్సి ఉండగా , రీ రికార్డు పనులు పూర్తి కాకపోయేసరికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 07 న అనుకున్నప్పటికీ ఆ రోజు మూడు నాల్గు సినిమాలు ఉండడం తో నిర్మాతలు ఆ రోజు కాకుండా సెప్టెంబర్ 13 వినాయక చవితి రోజయితే బాగుంటుందని ఆ తేదీని ఫిక్స్ చేసారు. ఇక ఆరోజు చైతు తో సమంత యూ టర్న్ తో పోటీ పడుతుంది. ఈ రెండు సినిమాలే కాదు సుధీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' చిత్రం కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో మొత్తం మీద ఈ మూడు చిత్రాల మధ్య మాత్రం విపరీతమైన పోటీ ఉండనుంది. మరి ఈ మూడిట్లో ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు