విదేశీ పర్యటనకు భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- August 26, 2018
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు ఆదివారం బయల్దేరారు. వియత్నాం, కాంబోడియాలలో ఆమె ఈ నెల 30 వరకు పర్యటిస్తారు. వియత్నాంలో ఈ నెల 27, 28 తేదీల్లోనూ, కాంబోడియాలో ఈ నెల 29, 30 తేదీల్లోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వియత్నాంలో జాయింట్ కమిషన్ 16వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వియత్నాం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్హ్ మిన్హ్ పాల్గొంటారు. వియత్నాం ప్రధాన మంత్రి ఎన్గుయెన్ జువాన్ ఫుస్తో చర్చలు జరుపుతారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ను ప్రారంభిస్తారు.
కాంబోడియాలో ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రాక్ సోఖోన్న్తో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధాని హున్ సేన్, ఆ దేశ సెనేట్ అధ్యక్షుడు సే ఛుమ్లతో చర్చలు జరుపుతారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









