విదేశీ పర్యటనకు భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

- August 26, 2018 , by Maagulf
విదేశీ పర్యటనకు భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్

న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు ఆదివారం బయల్దేరారు. వియత్నాం, కాంబోడియాలలో ఆమె ఈ నెల 30 వరకు పర్యటిస్తారు. వియత్నాంలో ఈ నెల 27, 28 తేదీల్లోనూ, కాంబోడియాలో ఈ నెల 29, 30 తేదీల్లోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వియత్నాంలో జాయింట్ కమిషన్ 16వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వియత్నాం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్హ్ మిన్హ్ పాల్గొంటారు. వియత్నాం ప్రధాన మంత్రి ఎన్‌గుయెన్ జువాన్ ఫుస్‌తో చర్చలు జరుపుతారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తారు.
కాంబోడియాలో ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రాక్ సోఖోన్న్‌తో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధాని హున్ సేన్, ఆ దేశ సెనేట్ అధ్యక్షుడు సే ఛుమ్‌లతో చర్చలు జరుపుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com