విదేశీ పర్యటనకు భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- August 26, 2018
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు ఆదివారం బయల్దేరారు. వియత్నాం, కాంబోడియాలలో ఆమె ఈ నెల 30 వరకు పర్యటిస్తారు. వియత్నాంలో ఈ నెల 27, 28 తేదీల్లోనూ, కాంబోడియాలో ఈ నెల 29, 30 తేదీల్లోనూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వియత్నాంలో జాయింట్ కమిషన్ 16వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వియత్నాం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్హ్ మిన్హ్ పాల్గొంటారు. వియత్నాం ప్రధాన మంత్రి ఎన్గుయెన్ జువాన్ ఫుస్తో చర్చలు జరుపుతారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ను ప్రారంభిస్తారు.
కాంబోడియాలో ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రాక్ సోఖోన్న్తో చర్చలు జరుపుతారు. ఆ దేశ ప్రధాని హున్ సేన్, ఆ దేశ సెనేట్ అధ్యక్షుడు సే ఛుమ్లతో చర్చలు జరుపుతారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి