డబ్ల్యుపిఎస్ కింద 850 ఉద్యోగుల నమోదు
- December 16, 2015
అహ్లి బ్యాంక్ అతి త్వరలో పేరోల్ కార్డ్ని తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్డ్ 6000 ఖతారీ రియాల్స్ వరకూ వేతనాన్ని సంపాదించే ఉద్యోగులకు అందజేస్తారు. డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అహ్లిబ్యాంక్ ఆండ్రూ మెక్కెనిచీ మాట్లాడుతూ, ఈ కార్డ్ అన్ని ఏటీఎంల వద్ద, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్దా ఉపయోగించవచ్చనీ, వీసా లోగోతో కార్డులు రూపొందుతాయనీ, ఖతార్ మరియు ఓవర్సీస్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. 850 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్డ్ కోసం నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ 20 వేల లావాదేవీలు జరిగాయని ఆయన చెప్పారు. కొత్త విధానం ద్వారా సేఫ్ బ్యాంకింగ్ని అందుబాటులోకి తీసుకొచ్చామని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







