తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్..
- August 28, 2018
తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. వచ్చే నెలలో రెండు వారాల పాటు జరగనున్న ఈ లీగ్కు సరూర్నగర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో లీగ్పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కొత్త జట్లతో పాటు అన్ని టీమ్స్కు సంబంధించిన ఓనర్స్, కోచ్ , కెప్టెన్ల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ క్రీడలో తెలంగాణా నుంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ను ప్రోత్సహించే ఉధ్ధేశంతోనే టిపికెఎల్ నిర్వహిస్తున్నట్టు లీగ్ కమీషనర్ సంజయ్రెడ్డి చెప్పారు. యువ క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా అభివర్ణించారు. చింతల స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్ మ్యాచ్లను టీవీ 5 లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









