ముప్పుతిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి..
- August 31, 2018
హైటెక్ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇవి చివరకు బ్రెయిన్ స్ట్రోక్కూ దారితీస్తున్నాయి. పక్షవాతం అంటే వయస్సు పైబడిన వారికే వస్తుందని గతంలో అనుకునేవారు. కానీ, ఇపుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యుక్తవయసు వారికీ వస్తోంది. అంతేనా, మానసిక, పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యంబారిన పడుతున్నారు. ఒత్తిడి జయించి, బ్రెయిన్ స్ట్రోక్కు దూరంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని...
* రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు.
* రోజూ దూర ప్రయాణం చేయడం మానుకోవాలి.
* మానసిక ఒత్తిడికిగురయ్యే పనులకు దూరంగా ఉండాలి.
* ఆఫీసులో అరగంటకుపైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు.
* కూర్చుని పనిచేసే వారు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
* కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ సమయం కేటాయించుకోవాలి.
* నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతోపాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది.
* తలవెనుక భాగంలో తరుచూ నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి.
* రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* అధిక బరువు, హైపర్టెన్షన్, మధుమేహం వంటి సమస్యలుంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
* ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వుపదార్థాలు, పిండి పదార్ధాలను తగ్గించాలి. మంచి సంగీతం వినాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి