గల్ఫ్ ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్‌

- September 02, 2018 , by Maagulf
గల్ఫ్ ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్‌

తెలంగాణ:కాస్తా అటో ఇటో అంతా ఊహించిందే జరిగింది. ముందస్తుపై మరింత బలమైన సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. త్వరలోనే రాజకీయ ప్రకటన ఉంటుదని పొలిటికల్ బాంబ్‌ పేల్చారు. అయితే..ఆ నిర్ణయం ఏంటో మీరే చూస్తారంటూ సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూనే..ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే డైలాగులు పేల్చారు. తెలంగాణ సెంటిమెంట్‌ కు కొనసాగింపుగా ఈ సారి ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్‌.రాష్ట్ర భవిస్యత్ కోసం, తెలంగాణ సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకుంటే మందిదే మీరే తీసుకోండని కేబినెట్‌ మిత్రులు చెప్పారు. ఆ నిర్ణయం ఏమిటో త్వరలోనే మీరు వింటారు అంటూ ముందస్తుకు సూచనలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాం గిరీచేస్తున్నాయని ఎద్దేవాచేశారు. వారిలా తాము ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాయాలా? అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.చాలా కాలం నుంచి NRI పాలసీ కోసం గల్ఫ్ లో ఎదురు చూస్తున్న ప్రవాసీయులను  నిరాశపరిచిన కేసీఆర్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com