దేశం కాని దేశం వెళ్లి.. అప్పు తీర్చలేక తెలంగాణ యువకుడి ఆత్మహత్య
- September 02, 2018
తెలంగాణ:ఉపాధికోసం దేశం కానీ దేశం గల్ఫ్ వెళ్లి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన శుక్రవారం జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన చెన్నమేని అంజయ్య–ఎల్లవ్వ దంపతుల ఏకైక కుమారుడు సతీశ్(30), కుమార్తె ఉన్నారు. గతంలో రెండుసార్లు అంజయ్య, సతీష్ గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చారు. అయితే గత కొంతకాలంనుంచి అప్పులు బాధ భరించలేక సతమతమవుతున్నారు తండ్రీకొడుకులు. ఈ క్రమంలో అప్పుచేసి ఆరునెలల క్రితం సతీశ్ బహ్రెయిన్ వెళ్లగా, తండ్రి ఖతార్ వెళ్లాడు. అయితే ఇద్దరికి తక్కువ రాబడితో ఇబ్బంది పడుతున్నారు. ఈ చాలిచాలని వేతనాలతో అప్పులు ఎలా తీర్చాలో అని సతీష్ తన భార్యతో చెప్పుకుని మధనపడేవాడు. అయితే శుక్రవారం రాత్రి సతీష్ కు తల్లి, భార్య రాజ మణి, వీడియో కాల్ చేశారు ఇద్దరు కొడుకులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వారు వద్దని ఎంత వారించినా వినకుండా వారి కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్నాడు సతీశ్. దీంతో ఎలా కాపాడాలో తెలియక కుటుంబసభ్యులు రోదిస్తూ ఉండిపోయారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







