యెమెన్‌లో వైమానిక దాడులు

- September 09, 2018 , by Maagulf
యెమెన్‌లో వైమానిక దాడులు

సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్‌లో శాంతి చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలు, వైమానిక దాడుల్లో 84 మంది మృత్యువాత పడ్డారు. హుతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న హొడీడా ప్రావిన్సులో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 11 మంది సైనికులు, 73 మంది తిరుగుబాటుదారులు ఉన్నట్లు పేర్కొన్నాయి. సౌదీ మద్దతున్న యెమెన్‌ ప్రభుత్వం, హుతి తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు శనివారం ఐరాస చేసిన ప్రయత్నం విఫలమైంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com