పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా భారత్ లో కొనసాగుతున్న బంద్

- September 09, 2018 , by Maagulf
పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా భారత్ లో కొనసాగుతున్న బంద్

న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు 21 పార్టీలు మద్దతును ప్రకటించాయి. ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునివ్వగా.. రాజమండ్రిలో వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాపపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో బస్లాండ్ల దగ్గర నిరసన చేస్తున్నారు. పలు జిల్లాల్లో బస్టాండ్లకే బస్సులు పరిమితమవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోల్‌కతాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్‌తో కోల్‌కతా ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. కాగా బంద్ నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com