భవనం పైనుంచి పడి మెయిడ్ మృతి
- September 11, 2018
షార్జా: 22 ఏళ్ళ మెయిడ్ ఓ భవనం 19వ ఫ్లోర్ నుంచి కింది పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన షార్జాలోని అల్ కస్బా ప్రాంతంలో జరిగింది. రక్తపు మడుగులో పడి వున్న మెయిడ్ని కన్స్ట్రక్షన్ వర్కర్స్ గుర్తించి, షార్జా పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ మరియు అంబులెన్స్ చేరుకున్నా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 60 ఏళ్ళ మహిళ, ఆమె తనయుడు (30 ఏళ్ళు) వద్ద బాధితురాలు మెయిడ్గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. కిచెన్ని శుభ్రం చేస్తుండగా, విండో నుంచి కిందికి పడి మెయిడ్ ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. విచారణ నిమిత్తం మృతురాలు పనిచేస్తోన్న కుటుంబానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తిని బుహైరా పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్ళారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







