భవనం పైనుంచి పడి మెయిడ్ మృతి
- September 11, 2018
షార్జా: 22 ఏళ్ళ మెయిడ్ ఓ భవనం 19వ ఫ్లోర్ నుంచి కింది పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన షార్జాలోని అల్ కస్బా ప్రాంతంలో జరిగింది. రక్తపు మడుగులో పడి వున్న మెయిడ్ని కన్స్ట్రక్షన్ వర్కర్స్ గుర్తించి, షార్జా పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ మరియు అంబులెన్స్ చేరుకున్నా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 60 ఏళ్ళ మహిళ, ఆమె తనయుడు (30 ఏళ్ళు) వద్ద బాధితురాలు మెయిడ్గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. కిచెన్ని శుభ్రం చేస్తుండగా, విండో నుంచి కిందికి పడి మెయిడ్ ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. విచారణ నిమిత్తం మృతురాలు పనిచేస్తోన్న కుటుంబానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తిని బుహైరా పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్ళారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









