వాషింగ్టన్లో హరికేన్ ఎమర్జెన్సీ
- September 11, 2018
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ప్లారెన్స్' హరికేన్ అగ్రరాజ్యం అమెరికా తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. కరోలినా, వర్జీనియా రాష్ట్రాల మధ్య రేపు రాత్రికి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అక్కడి వాతారణ విభాగం తెలిపింది. దీంతో ఈ రాష్ట్రాల్లో తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అమెరికా తూర్పు తీరాన్ని 'ఫ్లోరెన్స్' తాకనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్లో మంగళవారం తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. 15 రోజుల పాటు హెచ్చరికలు అమల్లో ఉంటాయన్న వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్.. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. కాగా చివరిసారిగా వాషింగ్టన్లో 2016లో తుఫాను ఎమర్జెన్సీని ప్రకటించారు.
తాజా వార్తలు
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?









