వాషింగ్టన్లో హరికేన్ ఎమర్జెన్సీ
- September 11, 2018
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ప్లారెన్స్' హరికేన్ అగ్రరాజ్యం అమెరికా తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. కరోలినా, వర్జీనియా రాష్ట్రాల మధ్య రేపు రాత్రికి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అక్కడి వాతారణ విభాగం తెలిపింది. దీంతో ఈ రాష్ట్రాల్లో తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అమెరికా తూర్పు తీరాన్ని 'ఫ్లోరెన్స్' తాకనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్లో మంగళవారం తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. 15 రోజుల పాటు హెచ్చరికలు అమల్లో ఉంటాయన్న వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్.. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. కాగా చివరిసారిగా వాషింగ్టన్లో 2016లో తుఫాను ఎమర్జెన్సీని ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







