వాషింగ్టన్లో హరికేన్ ఎమర్జెన్సీ
- September 11, 2018
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ప్లారెన్స్' హరికేన్ అగ్రరాజ్యం అమెరికా తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. కరోలినా, వర్జీనియా రాష్ట్రాల మధ్య రేపు రాత్రికి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అక్కడి వాతారణ విభాగం తెలిపింది. దీంతో ఈ రాష్ట్రాల్లో తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అమెరికా తూర్పు తీరాన్ని 'ఫ్లోరెన్స్' తాకనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్లో మంగళవారం తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. 15 రోజుల పాటు హెచ్చరికలు అమల్లో ఉంటాయన్న వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్.. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. కాగా చివరిసారిగా వాషింగ్టన్లో 2016లో తుఫాను ఎమర్జెన్సీని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







