సౌదీ చేస్తున్న కొత్త ఆలోచనలు
- September 17, 2018
రియాద్ : సౌదీ అరేబియా పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త చర్యలు చేపట్టింది. ఉమ్రా యాత్ర కోసం వీసాతో సౌదీఅరేబియాకు వచ్చే భక్తులు ఇక నుంచి 30 రోజుల్లో దేశంలోని అన్ని నగరాలను పర్యటించవచ్చని ఆ సర్కారు ప్రకటించింది. ఉమ్రా యాత్రలో భాగంగా భక్తులు 15 రోజుల పాటు మక్కా, మదీనాల్లోని పెద్ద మసీదులను సందర్శించాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ వజ్జన్ చెప్పారు. హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో గడచిన నాలుగురోజుల్లో 25వేల మందికి ఉమ్రా కోసం వీసాలు జారీ చేశామని అజీజ్ వెల్లడించారు. సౌదీలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ కొత్త నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







