జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణీకుల చెవులు, ముక్కుల నుంచి రక్తం

- September 19, 2018 , by Maagulf
జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణీకుల చెవులు, ముక్కుల నుంచి రక్తం

ముంబై నుంచి జైపూర్‌కు వెళుతున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం టేకాఫ్ తీసుకున్న విమానంలో సుమారు 30 మంది ప్రయాణికుల చెవులు, ముక్కుల నుంచి అకస్మాత్తుగా రక్తం వచ్చింది. విమానంలో మొత్తం 166 మంది ప్రయాణీకులున్నారు. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం రావడంతో పైలట్లు విమానాన్ని వెంటనే ముంబైలో దించారు. ఏవియేషన్ అధికారులు వెంటనే డ్యూటీ స్టాఫ్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన పట్ల పౌర విమాన సంస్థ విచారణ చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com