తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు
- December 18, 2015
ఈ నెల 20న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో ఈ ఫౌండేషన్ను ప్రారంభించామని, గుడివాడలో గత సంవత్సరం అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనీనటుడు కృష్ణకు అందజేస్తున్నట్లు చెప్పారు. అక్కినేని గోల్డెన్ హీరోయిన్లు పేరుతో ఆయనతో పనిచేసిన విజయనిర్మల, జమున, జయప్రద, జయసుధలకు పురస్కారాలు అందజేయనున్నారు. అనంతరం నవరత్నాలు పేరుతో తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో శారద ఆకునూరి, రవి కొండబోలు, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









