తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు
- December 18, 2015
ఈ నెల 20న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో ఈ ఫౌండేషన్ను ప్రారంభించామని, గుడివాడలో గత సంవత్సరం అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనీనటుడు కృష్ణకు అందజేస్తున్నట్లు చెప్పారు. అక్కినేని గోల్డెన్ హీరోయిన్లు పేరుతో ఆయనతో పనిచేసిన విజయనిర్మల, జమున, జయప్రద, జయసుధలకు పురస్కారాలు అందజేయనున్నారు. అనంతరం నవరత్నాలు పేరుతో తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో శారద ఆకునూరి, రవి కొండబోలు, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్







