తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు

- December 18, 2015 , by Maagulf
తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు

ఈ నెల 20న అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించామని, గుడివాడలో గత సంవత్సరం అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనీనటుడు కృష్ణకు అందజేస్తున్నట్లు చెప్పారు. అక్కినేని గోల్డెన్‌ హీరోయిన్లు పేరుతో ఆయనతో పనిచేసిన విజయనిర్మల, జమున, జయప్రద, జయసుధలకు పురస్కారాలు అందజేయనున్నారు. అనంతరం నవరత్నాలు పేరుతో తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో శారద ఆకునూరి, రవి కొండబోలు, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com